ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ టెకీ శ్వేత ఆత్మహత్య కేసులో కొత్తకోణం

ABN, First Publish Date - 2020-10-13T20:58:47+05:30

ప్రియుడు మోసం చేశాడని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ శ్వేత ట్రైన్‌కు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ : ప్రియుడు మోసం చేశాడని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ శ్వేత ట్రైన్‌కు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా కొత్తకోణం వెలుగుచూసింది. శ్వేత ఆత్మహత్య చేసుకోలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కూతురిని అజయ్‌ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు.


హత్య చేసి రైల్వే ట్రాక్ దగ్గరకు అజయ్ తీసుకెళ్లాడని శ్వేత తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో శ్వేతను మోసం చేశాడని.. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వారు చెబుతున్నారు. శ్వేతను అజయ్ ప్రేమ పేరిట బ్లాక్ మెయిల్ చేశాడని.. వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశాడని వారు మీడియాకు వెల్లడించారు. ఆ అవమానం తట్టుకోలేక శ్వేత డిప్రెషన్‌కు లోనైందని పేరెంట్స్ అంటున్నారు.


రాచకొండ సైబర్‌క్రైమ్‌లో ఫిర్యాదు చేశామని, సీఐ, టెక్నీషియన్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని శ్వేత పేరెంట్ ఆరోపిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లు చూపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. గత నెల 18న అదృశ్యమైన శ్వేత బీబీనగర్ వద్ద రైలు పట్టాలపై శవమై కనిపించింది. శ్వేతది ఆత్మహత్య? హత్య? అనే కోణంలో పోలీసుల విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే నిందితుడు అజయ్‌ను అరెస్ట్ చేసిన మేడిపల్లి పోలీసులు విచారిస్తు్న్నారు. అయితే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం చేశారన్న శ్వేత తల్లిదండ్రుల ఆరోపణలపై ఇంతవరకూ ఖాకీలు స్పందించలేదు.

Updated Date - 2020-10-13T20:58:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising