ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు

ABN, First Publish Date - 2020-07-09T10:26:12+05:30

మారుమూల కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నడిపిస్తున్న ముఠా గుట్టును రాచకొండ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసుల అదుపులో నలుగురు..

ఇద్దరు యువతులను రక్షించిన పోలీసులు


జవహర్‌నగర్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మారుమూల కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నడిపిస్తున్న ముఠా గుట్టును రాచకొండ కమిషనరేట్‌ పరిధి మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు రట్టుచేశారు. ఇద్దరు నిందితులతోపాటు  ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. జవహర్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధి రిజిస్ట్రేషన్‌ కాలనీలో బిహార్‌కు చెందిన మిథిలేశ్‌ శర్మ, రజనీశ్‌రంజన్‌లు ఓ ఇండిపెండెంట్‌ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వారితో ఆ ఇంట్లో వ్యభిచారం చేయిస్తున్నారు. సుచిత్రలో నివా సం ఉండే కాంబ్లే సుకేశ్‌ వీరికి కావాల్సిన వసతులు సమకూరుస్తున్నాడు. బుధవారం విశ్వసనీయ సమాచారం మేరకు జవహర్‌నగర్‌, మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు సదరు ఇంటిపై దాడులు నిర్వహించారు. అక్కడ ఉన్న రజనీశ్‌, సుకేశ్‌కాంబేలతోపాటు విటులు సాయికిరణ్‌, సిరాజ్‌లను అరెస్ట్‌ చేశారు. నాలుగు ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్లు, కొంత నగదు, కండోమ్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇద్దరు యువతులను పోలీసులు రక్షించారు. 

Updated Date - 2020-07-09T10:26:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising