ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుట్టిన రోజు వేడుకల్లో విషాదం.. భోజనం చేసిన వెంటనే

ABN, First Publish Date - 2020-12-30T06:25:01+05:30

స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న హోంగార్డు భోజనం చేసిన కొద్ది సేపటికే వాంతులు చేసుకుంటూ కిందపడి మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోజనం చేసిన వెంటనే హోంగార్డు మృతి

బేగంపేట, డిసెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న హోంగార్డు భోజనం చేసిన కొద్ది సేపటికే వాంతులు చేసుకుంటూ కిందపడి మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనిసరావు కథనం ప్రకారం.. ఫతేనగర్‌కు చెందిన హోంగార్డు బోయ ఆనంద్‌(34) డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 11.30 సమయంలో రసూల్‌పురలోని వల్లభ్‌బాయ్‌ పటేల్‌ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. భోజనం చేసి కుర్చీపై కూర్చున్న తర్వాత వాంతులు చేసుకుంటూ కిందపడిపోయాడు. పక్కన ఉన్న వారు అతడిని పైకి లేపేందుకు యత్నించగా, అప్పటికే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే 108కు ఫోన్‌ చేయగా, అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి పరీక్షించి చనిపోయాడని చెప్పారు. బోయ ఆనంద్‌ మృతిపై అనుమానాలు ఉన్నాయని, దర్యాప్తు చేయాలని మృతుడి తండ్రి రిటైర్ట్‌ ఎస్‌ఐ శివప్ప బేగంపేట పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2020-12-30T06:25:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising