ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

ABN, First Publish Date - 2020-09-27T09:45:30+05:30

ఎల్‌బీనగర్‌ డీ-మార్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఎ్‌సఆర్టీసీ డ్రైవర్‌మృతిచెందాడు. ఎల్‌బీనగర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తపేట, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఎల్‌బీనగర్‌ డీ-మార్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఎ్‌సఆర్టీసీ డ్రైవర్‌మృతిచెందాడు. ఎల్‌బీనగర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని శక్తినగర్‌లో ఉండే మహ్మద్‌ షఫియొద్దీన్‌(59) ముషీరాబాద్‌-1 టీఎ్‌సఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం 6.30గంటలకు అతడు బైకుపై విధులకు బయలు దేరాడు. 7గంటలకు ఎల్‌బీనగర్‌ డీ-మార్టు యూటర్న్‌ వద్ద గుర్తు తెలియని వాహనం అతడి బైకును ఢీకొట్టి వెళ్లింది. దీంతో అతడు బైకుపై నుంచి కిందపడ్డాడు. తల వెనుక భాగంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు అతడి వద్ద లభ్యమైన ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అతడి కుమారుడు ఇబ్రహీం ఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇబ్రహీం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌ఓ అశోక్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-09-27T09:45:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising