ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ నెక్లెస్‌.. సొంత వారికి చేరింది..

ABN, First Publish Date - 2020-12-27T06:33:45+05:30

ఈ నెల 24న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన ‘ఒక నెక్లెస్‌.. ముగ్గురు మహిళలు’ కథనం బాధితురాలు తిరిగి తన నెక్లెస్‌ పొందేలా చేసింది.

బాధితురాలికి నెక్లెస్‌ అందజేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ కొత్వాల్‌, డీఐ శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆంధ్రజ్యోతి’ కథనం చూసి పోలీసులను ఆశ్రయించిన మహిళ

ఆధారాలు నిర్ధారించుకుని నెక్లెస్‌ అందజేత

మదీన, డిసెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 24న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన ‘ఒక  నెక్లెస్‌.. ముగ్గురు మహిళలు’ కథనం బాధితురాలు తిరిగి తన నెక్లెస్‌ పొందేలా చేసింది. అన్ని ఆధారాలతో పోలీ్‌సస్టేషన్‌కు వచ్చిన ఆమెకు శనివారం పోలీసులు నెక్లెస్‌ అందజేశారు. ఈనెల 20న పార్ధీవాడ చౌరస్తాలో రోడ్డుపై పడి ఉన్న నెక్లె్‌సను ముగ్గురు మహిళలు చూసి తీసుకున్నారు. దానిని పంచుకునే విషయంలో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. విషయం కాస్తా హుస్సేనిఆలం పోలీసులకు తెలియడంతో వారు ఆ నెక్లె్‌సను స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయాన్ని ఈ నెల 24న ‘ఆంధ్రజ్యోతి’లో నెక్లెస్‌ ఫొటోతో ప్రచురించింది. ఈ కథనాన్ని చూసిన హబీబ్‌నగర్‌కు చెందిన రాజేష్‌ సతీమణి పి. కవిత శనివారం పోలీసులను సంప్రదించారు. నెక్లెస్‌ తనదేనని కొనుగోలు చేసిన బిల్లు, దానిని ధరించిన ఫొటోలను చూపించారు. దీంతో సదరు నెక్లెస్‌ ఆమెదేనని నిర్ధారించుకున్న పోలీసులు బాధితురాలికి నెక్లె్‌సను అందజేశారు.   

Updated Date - 2020-12-27T06:33:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising