24 రోజుల పాటు అమ్మవారికి బోనాలు
ABN, First Publish Date - 2020-06-04T09:03:16+05:30
మీరాలం మండి మహాకాలేశ్వర ఆలయంలో ఈ ఏడాది 24రోజులపాటు అమ్మవారికి బోనాల సమర్పణ
చార్మినార్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): మీరాలం మండి మహాకాలేశ్వర ఆలయంలో ఈ ఏడాది 24రోజులపాటు అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని దేవాలయ కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య తెలిపారు. ఆషాడ మాస బోనాల జాతర జూన్ 25 నుంచి జులై 18 వరకు జరుగుతుందన్నారు. జులై 19న దేవాలయ కమిటీ తరఫున అమ్మవారికి బంగారు పాత్రలో బోనం సమర్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన కమిటీని ఆయన ప్రకటించారు. ఉపాధ్యక్షడిగా సి.విజయానందరావు, జి. అనంతయ్య, వి. దుర్గయ్య, ఆత్రేయ చార్యులు, ప్రధాన కార్యదర్శిగా తాట కృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శి ఎ.రమేశ్, కోశాధికారిగా రమేశ్ను నియమించినట్లు తెలిపారు.
Updated Date - 2020-06-04T09:03:16+05:30 IST