ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయం మాదే: లక్ష్మణ్

ABN, First Publish Date - 2020-12-04T19:01:00+05:30

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీ మెజారిటీ సాధించిందని లక్ష్మణ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీ మెజారిటీ సాధించిందని లక్ష్మణ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 75కుపైగా డివిజన్లలో బీజేపీ ఆధిక్యత సాధించిందన్నారు. ఇంత ఆధిక్యత వచ్చిందంటే.. ఇది విజయానికి సంకేతమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారంటే.. ప్రజలకు కూడా ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందన్నారు. మొదటి నుంచి అధికారపార్టీ ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కయిందని ఆయన విమర్శించారు. బీజేపీ గెలవకుండా కుట్రలు చేసిందన్నారు. తక్కువ శాతం పోలింగ్ కావాలని ప్రభుత్వం కోరుకుందని ఆరోపించారు. అయినప్పటికి ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పతనానికి ఇది నాంది అని  లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-12-04T19:01:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising