ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ వర్షాలకు కూలిన ఇళ్లు...ఎనిమిది మంది మృతి

ABN, First Publish Date - 2020-10-14T12:23:00+05:30

నగరంలో భారీ వర్షం విషాదాన్ని నింపింది. నిన్నటి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రెండు ఇళ్లు కూలిపోవడంతో దాదాపు ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో భారీ వర్షం విషాదాన్ని నింపింది. నిన్నటి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రెండు ఇళ్లు కూలిపోవడంతో దాదాపు ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. పాతబస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాతబస్తీ చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గౌస్‌నగర్ ప్రాంతంలో వర్షం కారణంగా ఎత్తైన ప్రదేశం నుండి రాళ్లు వచ్చి క్రింద  ఉన్న ఇళ్ల గోడలపై పడడంతో రెండు ఇళ్ల గోడలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదు మంది మరణించారు. మరో నాలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఫలక్‌నుమా ఏసీపీ కూడా ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Updated Date - 2020-10-14T12:23:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising