తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్
ABN, First Publish Date - 2020-10-23T17:17:51+05:30
తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. శుక్రవారం ఉదయం తెలంగాణ పోలీస్ అకాడమీలో 12వ బ్యాచ్కు చెందిన 1162 మంది ఎస్.ఐల పాసింగ్ అవుట్ పరేడ్ ప్రారంభమైంది. ఈ పాసింగ్ అవుట్ పరేడ్లో సివిల్కు చెందిన 661 ఎస్ఐలు, ఐటీ, కమ్యూనికేషన్కు చెందిన 28 మంది ఎస్ఐలు... 448 ఆర్ఎస్ఐలు, ఫింగర్ ప్రింట్కు చెందిన 25 మంది ఏఎస్ఐలు ఉన్నారు. వీరిలో 256 మంది మహిళా ఎస్.ఐలు ఉన్నారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్కు ముఖ్య అతిధిగా హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, డీ.జీ.పీ. ఎం.మహేందర్ రెడ్డి, సీనియర్ పోలీస్ ఉన్నతాధికారులు, ట్రైనింగ్ పూర్తైన ఎస్ఐల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త ఎస్ఐలతో పోలీస్ అకాడమీ ఇంచార్జ్ డైరెక్టర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు.
Updated Date - 2020-10-23T17:17:51+05:30 IST