ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రి భోజనం చేసి నిద్రపోయిన బాలిక తెల్లారేసరికి అదృశ్యం

ABN, First Publish Date - 2020-07-13T12:16:05+05:30

హైదరాబాద్ : నగరంలో రోజురోజుకూ మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : నగరంలో రోజురోజుకూ మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇలాంటి కేసులు పెండింగ్‌లోనూ, మిస్టరీగానే ఉండిపోయాయి. తాజాగా నగరంలోని బాలానగర్‌లో 15 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రులతో కలిసి రాత్రి భోజనం చేసి నిద్రపోయిన బాలిక తెల్లారేసరికి కనిపించకుండాపోయింది. పూర్తి వివరాల్లోకెళితే.. బీహార్‌కు చెందిన రామ్‌బిలాస్ సహాని, సరితాదేవి దంపతులు 18 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి వచ్చి బాలానగర్‌ గౌతమీనగర్‌లో గల నాగార్జున నగర్‌ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. 


పెద్ద కుమార్తె కాజల్ కుమారి (15) స్థానికంగా గల ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి నిద్రపోయింది. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు చూడగా కనిపించట్లేదు. చుట్టు పక్కల ప్రాంతాల్లో బాలిక ఆచూకీ కోసం ఎంత వెతికినా లభించకపోవడంతో తల్లి సరితాదేవి బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు కేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2020-07-13T12:16:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising