ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు యువకులపై గ్యాంగ్‌ దాడి

ABN, First Publish Date - 2020-06-07T14:29:31+05:30

కొందరు గ్యాంగ్‌గా వచ్చి ఇద్దరు యువకులపై దాడి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/జీడిమెట్ల : జీడిమెట్ల ఎస్‌ఆర్‌నాయక్‌ నగర్‌లో శుక్రవారం రాత్రి కొందరు గ్యాంగ్‌గా వచ్చి ఇద్దరు యువకులపై దాడి చేశారు. బాధితులు కాపాడాలని వేడుకుంటూ.. ప్రాణభయంతో పరుగులు తీశారు. జీడిమెట్ల సాయిబాబానగర్‌ పాండుబస్తీకి చెందిన హరీష్‌, సుభా్‌షనగర్‌కు చెందిన రాహుల్‌ స్నేహితులు. వీరు శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఎస్‌ఆర్‌నాయక్‌ నగర్‌ పార్కు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు.


ఈ క్రమంలో సాయిబాబానగర్‌కు చెందిన రాజు, శ్రావణ్‌ తమ గ్యాంగ్‌తో వచ్చి  రాహుల్‌, హరీ్‌షలను దూషిస్తూ తీవ్రంగా కొట్టారు. బాధితులు ప్రాణభయంతో పరుగులు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన యువకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై శనివారం కేసు నమోదు చేశారు. ఈ దాడి వెనుక రాజకీయ హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటన విజయవాడలో జరిగిన గ్యాంగ్‌వార్‌ను తలపించిందని స్థానికులు అంటున్నారు. 

Updated Date - 2020-06-07T14:29:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising