నకిలీ పాస్ పోర్టు పోర్టల్తో మోసం
ABN, First Publish Date - 2020-09-21T07:44:20+05:30
నకిలీ పాస్పోర్టు పోర్టల్లో డబ్బులు కట్టి మాజీ డీజీపీ కోడలు మోసపోయారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్కు చెందిన
పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ డీజీపీ కోడలు
బంజారాహిల్స్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): నకిలీ పాస్పోర్టు పోర్టల్లో డబ్బులు కట్టి మాజీ డీజీపీ కోడలు మోసపోయారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్కు చెందిన జన్నీఫర్ బహుగుణ మాజీ డీజీపీ కోడలు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆమె తన తల్లి పాస్పోర్టును రెన్యువల్ చేసేందుకు వెబ్సైట్లు వెతకగా, ఇండియా పాస్పోర్టుసేవా.కో.ఇన్ కనిపించింది. అఽధికారిక వెబ్సైట్ మాదిరిగానే ఉండటంలో అందులో అన్ని వివరాలు నమోదు చేశారు. స్లాట్ బుకింగ్ కోసం రూ. 2,999 చెల్లించారు. కొద్ది రోజుల తర్వాత స్నేహితుడి ద్వారా తాను దరఖా స్తు చేసిన వెబ్సైట్ నకిలీదని తెలిసింది. వెంటనే ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆధారాలు సమర్పించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-09-21T07:44:20+05:30 IST