ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2.85 లక్షల మందికి పరిహారం అందజేత

ABN, First Publish Date - 2020-10-30T09:57:14+05:30

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వరద ముంపునకు గురైన కుటుంబాలను గురువారం సాయంత్రం వరకు 3,91,966 గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వరద ముంపునకు గురైన కుటుంబాలను గురువారం సాయంత్రం వరకు 3,91,966 గుర్తించారు. నగరంలోని 1572 కాలనీలు వరద ముంపునకు ప్రభావితమవ్వగా, ఆయా కాలనీల్లోని కుటుంబాలు ముంపునకు గురైనట్లు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్థారించారు. ఇప్పటి వరకు ముంపు బాధితుల తుది జాబితా పూర్తవ్వలేదు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ముంపునకు గురైన కుటుంబాలకు పరిహారం అందజేసే ప్రక్రియ వేగవంతం చేశారు. ప్రతీ కుటుంబానికి ప్రాథమికంగా రూ.10వేలు అందజేసే ప్రక్రియలో భాగంగా గురువారం సాయంత్రం వరకు సుమారు 2.85 లక్షల మంది కుటుంబాలకు రూ.284 కోట్లను పంపిణీ చేశారు. గురువారం ఒక్కరోజే సాయంత్రం 4.30 గంటల వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఐదు జోన్ల పరిధిలో 51,737కుటుంబాలకు పరిహారం అందజేశారు. ప్రతీ బాధిత కుటుంబానికి పరిహారం అందజేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. తెలిపారు. ఈ నెలాఖరు వరకు బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయాలని అధికారులు లక్ష్యాన్ని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

Updated Date - 2020-10-30T09:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising