ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ మృతి

ABN, First Publish Date - 2020-07-02T15:26:12+05:30

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ మృతి చెందారు. చంపాపే డివిజన్‌ రెడ్డి కాలనీలో నివసిస్తున్న మాజీ ఎమ్మెల్సీ పి. రామబ్రహ్మం(83) అనారోగ్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంపాపేట, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ మృతి చెందారు. చంపాపే డివిజన్‌ రెడ్డి కాలనీలో నివసిస్తున్న మాజీ ఎమ్మెల్సీ పి. రామబ్రహ్మం(83) అనారోగ్యం బారిన పడడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మదిర పట్టణంలో 1936 ఫిబ్రవరి 4న ఆయన జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం కొన్నేళ్లపాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1972లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై 1976 వరకు కొనసాగారు. 


28 సంవత్సరాల నుంచి రెండ్డి కాలనీలో ఉంటూ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన భార్య సిటీ కళాశాలలో కెమెస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహించి పదవీ విరమణ చేశారు. రామబ్రహ్మం కుమారుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తుండగా, కుమార్తె, అల్లుడు మెహిదీపట్నంలో ఉంటూ డాక్టర్లుగా పనిచేస్తున్నారు. రామబ్రహ్మం ఆకస్మిక మృతిపట్ల కార్పొరేటర్‌ సామ రమణారెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రఘుమారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. 

Updated Date - 2020-07-02T15:26:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising