ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్‌ కోసం రోడ్డెక్కిన వృద్ధులు, దివ్యాంగులు

ABN, First Publish Date - 2020-08-11T10:04:24+05:30

ప్రతినెల మొదటివారంలో అందాల్సిన పింఛన్‌లు రెండు నెలలు అయినా ఇవ్వకపోవడంతో జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌కు చెందిన వృద్ధులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జవహర్‌నగర్‌ ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ప్రతినెల మొదటివారంలో అందాల్సిన పింఛన్‌లు రెండు నెలలు అయినా ఇవ్వకపోవడంతో జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌కు చెందిన వృద్ధులు, దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్‌ చెల్లించాలంటూ రోడ్డుపై సోమవారం ధర్నా చేశారు. దివ్యాంగుల హక్కుల సాధన సమితి అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ.. జూలై, ఆగస్టు నెలల పింఛన్‌ ఇంకా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎప్పుడు ఇస్తారో అధికారులు సమాచారం ఇవ్వడం లేదన్నాడు. రోడ్డుపై బైఠాయించిన వృద్ధులు, దివ్యాంగులను డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ సముదాయించారు. అధికారులకు సమాచారం ఇచ్చామని, మరో రెండు రోజులు వేచి చూడమని చెప్పడంతో వారు ధర్నాను విరమించారు. 

Updated Date - 2020-08-11T10:04:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising