సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆశ.. నిరాశ
ABN, First Publish Date - 2020-05-23T10:56:22+05:30
తమ నియోజకవర్గ ఎమ్మెల్యే సొంతూళ్లకు వెళ్లేందుకు రైలు ఏర్పాటు చేశారనే ఆనందంతో మూటాముల్లే సర్దుకొని పిల్లలతో
రైలు ఏర్పాటుకు అనుమతించని కేంద్రం
ఫలించని ఎమ్మెల్యే ప్రయత్నం
ఒడిశా కార్మికుల్లో నిరుత్సాహం
రెజిమెంటల్ బజార్, మే 22 (ఆంధ్రజ్యోతి): తమ నియోజకవర్గ ఎమ్మెల్యే సొంతూళ్లకు వెళ్లేందుకు రైలు ఏర్పాటు చేశారనే ఆనందంతో మూటాముల్లే సర్దుకొని పిల్లలతో స్టేషన్కు వచ్చిన వలస కార్మికులు రైలు లేదని తెలిసి ఊసురుమంటూ తిరిగి వెళ్లారు. ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా, పార్లకెమండి ఎమ్మెల్యే నారాయణరావు తన నియోజకవర్గ వలస కార్మికులు హైదరాబాద్లో ఉండటంతో ప్రత్యేక రైలులో వారిని సొంతూళ్లకు తరలించటానికి రైలు ఏర్పాటు చేసినట్లు, శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుందని వారికి సమాచారం ఇచ్చారు.
సుమారు నాలుగు వందల మంది కార్మికులు సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడినా రైల్వే శాఖ రైలు ఏర్పాటు చేయలేదు. త్వరలో ఏర్పాటు చేయిస్తానని ఆయన చెప్పడంతో స్టేషన్కు వచ్చిన కార్మికులు నిరుత్సాహంతో తిరిగి వెళ్లిపోయారు. కూలి పనికోసం ఆరు నెలల క్రితం హైదరాబాద్ వచ్చినట్లు కార్మికుడు రమేష్ తెలిపారు.
Updated Date - 2020-05-23T10:56:22+05:30 IST