ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశరక్షణలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అవసరం

ABN, First Publish Date - 2020-12-11T07:15:23+05:30

దేశరక్షణ వ్యవస్ధలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అవసరమని సీనియర్‌ కల్నల్‌ కమాడెంట్‌, ఈఎంఈ డైరెక్టర్‌ జనరల్‌ అనిల్‌కపూర్‌ అన్నారు.

స్నాతకోత్సవంలో మాట్లాడుతున్న ఈఎంఈ డైరెక్టర్‌ జనరల్‌ అనిల్‌కపూర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈఎంఈ డైరెక్టర్‌ జనరల్‌ అనిల్‌కపూర్‌

అల్వాల్‌, డిసెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): దేశరక్షణ వ్యవస్ధలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అవసరమని సీనియర్‌ కల్నల్‌ కమాడెంట్‌, ఈఎంఈ డైరెక్టర్‌ జనరల్‌ అనిల్‌కపూర్‌ అన్నారు. తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన 101వ డిగ్రీ ఇంజనీర్‌ కోర్సు, 34వ టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ కోర్స్‌ సాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇంజనీరింగ్‌ పట్టభద్రులైన వారికి పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. జీవితంలో ఏవిధంగా నిలదోక్కుకోవాలి, చాలెంజ్‌ పై ఏ విధంగా ఫోకస్‌ చేయాలనే అంశలపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా వ్యూకార్ట్‌ అనే సూత్రాన్ని వివరించారు. ఎంసీఈఎంఈ కమాండెంట్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ నారాయణన్‌ కూడా మాట్లాడారు. 101వ డిగ్రీ ఇంజనీరింగ్‌ కోర్సులో కెప్టెన్‌ అనురాగ్‌ సింగ్‌ డీజీఈఎంఈ ట్రోఫీని అందుకున్నారు. డీఈ కోర్సులో మెరిట్‌ క్రమంలో మొదటి స్ధానం లో నిలిచిన కెప్టెన్‌ రాజావత్‌ డీజీఈఎంఈ గోల్డ్‌మెడల్‌ పొందారు. టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ కోర్సులలో ఆల్‌రౌండర్‌ ప్రదర్శన కనబర్చిన శర్మకు డీజీఈఎంఈ గోల్డ్‌మెడల్‌ అందజేశారు.

Updated Date - 2020-12-11T07:15:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising