ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్తింటి వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-29T06:54:15+05:30

అదనపు కట్నంకోసం అత్తింటి చిత్రహింసలు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీడిమెట్ల, డిసెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): అదనపు కట్నంకోసం అత్తింటి చిత్రహింసలు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. పెరుమళ్ల స్వప్న(29), రంజిత్‌ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. చింతల్‌ ప్రసూననగర్‌లో నివసిస్తున్నారు. రంజిత్‌ జీడిమెట్లలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా రంజిత్‌, అతడి తల్లి సావిత్రి, మరిది అనిల్‌, రాజు అదనపు కట్నం కోసం స్వప్నను చిత్రహింసలు పెట్టేవారు. స్వప్న సోదరుడి వివాహం కావడంతో ఆడపిల్ల కట్నం కింద రూ. 2 లక్షలు ఇవ్వాలని అత్తింటివారు వేధింపులకు గురి చేశారు. దీంతో ఈ నెల 26న లక్ష రూపాయలు తీసుకొచ్చింది. 27వ తేదీన ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-29T06:54:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising