ఇంటి స్థలం ఇప్పిస్తానని డబ్బులు వసూలు
ABN, First Publish Date - 2020-09-21T07:45:05+05:30
ఇంటి స్థలం ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ లక్ష్మీనారాయణ
వ్యక్తిపై కేసు నమోదు
హైదర్నగర్, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): ఇంటి స్థలం ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కుంచల లక్ష్మణ్(45) నిజాంపేట రాజీవ్గృహకల్ప సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కేపీహెచ్బీకాలనీకి చెందిన వి.రాజ్రంజిత్కు ఎనిమిది నెలల్లో 60 గజాల ఇంటి స్థలం ఇందిరమ్మకాలనీలో ఇప్పిస్తానని రూ.1.80లక్షలు తీసుకున్నాడు. ఓ ధ్రువపత్రం ఇచ్చాడు. దీనిని తీసుకుని రాజ్రంజిత్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. లక్ష్మణ్ ఇచ్చిన పత్రం నకిలీదిగా తేలింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-09-21T07:45:05+05:30 IST