గరికపాటి ఇంట్లో బీజేపీ నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్
ABN, First Publish Date - 2020-11-28T15:32:32+05:30
రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహనరావు ఇంట్లో బీజేపీ నేతలు శనివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు.
హైదరాబాద్: రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహనరావు ఇంట్లో బీజేపీ నేతలు శనివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది. రోడ్షోలు, జాతీయ నేతలతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రేపటితో ప్రచారానికి తెరబడనున్నడంతో నేడు ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించేలా బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు.
అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈరోజు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 3 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని జీడిమెట్ల ప్రాంతంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి రోడ్షో ప్రారంభించి, ఆల్విన్ క్రాస్ రోడ్స్కు సాయంత్రం 5 గంటలకు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు లాల్ దర్వాజ దగ్గర్లోని అల్కా థియేటర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసే సభలో యోగీ పాల్గొననున్నారు.
Updated Date - 2020-11-28T15:32:32+05:30 IST