ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి కేటీఆర్‌పై భూపేందర్ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-11-28T16:08:03+05:30

మంత్రి కేటీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి- రాచరికానికి జరుగుతోన్న ఎన్నికలని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి- రాచరికానికి జరుగుతోన్న ఎన్నికలని అన్నారు. అబద్ధాలు చెప్పటంలో మంత్రి కేటీఆర్‌ను మించిన వాళ్ళు లేరని వ్యాఖ్యానించారు. మెట్రో రైల్, కోవిడ్ నిధులు ఎవరిచ్చారో కేటీఆర్ తెలుసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ కేసీఅర్ , కేటీఆర్ కుటుంబానిది మాత్రమే కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్ భారతదేశంలోనే ఛారిత్రాత్మక నగరమన్నారు. గ్రేటర్ మేయర్ పీఠాన్ని బీజేపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 


టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. నగర ప్రజలకు మంచి నీరు సప్లై చేయటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. హైదరాబాద్ నగరం భారత ప్రజల హృదయంలో ఉంటోందని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ  జాతీయ నాయకులొస్తే.. తప్పేంది అని భూపేందర్ యాదవ్ ప్రశ్నించారు. 

Updated Date - 2020-11-28T16:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising