‘మాజీ మంత్రిపై చర్యలు తీసుకోవాలి’
ABN, First Publish Date - 2020-08-15T09:19:56+05:30
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ను కులం పేరుతో దూషించి, చంపుతానని
నేరేడ్మెట్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ను కులం పేరుతో దూషించి, చంపుతానని బెదరించిన మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్రెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పి. చంద్రశేఖర్, గ్రేటర్ హైదరాబాద్ నగర అధ్యక్షుడు రవికాంత్నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం నేరేడ్మెట్ పోలీసుస్టేషన్లో తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు పిలుపు మేరకు రవికాంత్ ఆధ్వర్యంలో స్థానిక మాల మహనాడు నాయకులు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2020-08-15T09:19:56+05:30 IST