ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 1014 ఆటోల సీజ్‌

ABN, First Publish Date - 2020-03-24T16:24:22+05:30

లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని, లేకుంటే వాహనాలను సీజ్‌ చేస్తామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అకారణంగా రాత్రి వేళ బయటకొస్తే కఠిన చర్యలు

రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని, లేకుంటే వాహనాలను సీజ్‌ చేస్తామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ హెచ్చరించారు. జనతా కర్ఫ్యూ సమయంలో సంయమనంతో ఇళ్లలో ఉన్నవాళ్లు సోమవారం ఉదయం రోడ్లపైకి వచ్చారు. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ఇచ్చిన వెసులుబాటును దుర్వినియోగం చేసి రోడ్లపై తిరగడం ప్రారంభించారు. ఇలా చేయడం వల్ల జనతా కర్ఫ్యూ ప్రకటించినా, లాక్‌డౌన్‌ విధించినా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సరైన కారణం లేకుండా ద్విచక్రవాహనాలపై తిరుగుతున్న వారి వాహనాలను, ప్యాసింజర్లను తీసుకెళ్తున్న ఆటోలను కూడా సీజ్‌ చేశామన్నారు. సాయంత్రం 6.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రోడ్లపై ఎలాంటి వాహనాలకు అనుమతిలేదని, సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన కార్లు, బైకులు, ఆటోలను సీజ్‌ చేస్తామని ట్రై కమిషనరేట్‌ సీపీలు హెచ్చరించారు.

Updated Date - 2020-03-24T16:24:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising