ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దంపతుల అమానుషం...కాళ్లు పట్టుకున్నా వదలని వైనం

ABN, First Publish Date - 2020-02-19T16:14:27+05:30

దంపతుల అమానుషం...కాళ్లు పట్టుకున్నా వదలని వైనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్ ప్రభుత్వ పాఠశాల వద్ద దారుణం చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ఓ  మహిళ విచక్షణారహితంగా కొట్టింది. అమానుషంగా దాడి చేసింది. రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆడుకుంటూ ఉండగా అటు నుంచి ఓ జంట వెళుతోంది. ఆడుకుంటున్న విద్యార్థుల్లో ఒకరిపై భార్యాభర్త విచక్షణారహితంగా దాడి చేశారు. ఇది చూసిన విద్యార్థి స్నేహితుడు వచ్చి...కొట్టొద్దు, ఏం చేయలేదు అంటూ వారిని బతిమిలాడాడు. అదే సమయంలో బాధిత విద్యార్థి దంపతుల కాళ్లు పట్టుకున్నాడు. అయినా వారు కనికరించలేదు. లేబర్ పిల్లలు, చిల్లరగాళ్లు అంటూ విద్యార్థులపై దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సీసీ టీవీ దృశ్యాలను చూసిన పోలీసులకు అసలు విషయమేంటో అర్ధమైంది. విద్యార్థులపై దాడి చేయడమే కాకుండా ఫిర్యాదు చేసిన దంపతులపై పోలీసులు కేసు పెట్టి, వారిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-02-19T16:14:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising