దారుణం...అల్లుడిని కత్తితో పొడిచి చంపిన అత్త
ABN, First Publish Date - 2020-10-29T17:09:36+05:30
బిడ్డ ఆత్మహత్యకు ప్రతీకారంగా అల్లుడిని హత్య చేసింది
హైదరాబాద్: నగరంలోని రామంతాపూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అల్లుడిని అత్త కత్తితో పొడిచి చంపింది. తన బిడ్డ ఆత్మహత్యకు ప్రతీకారంగా అల్లుడిని హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే.. రామంతాపూర్కు చెందిన నవీన్కు మీర్పేటకు చెందిన ఓ యువతితో వివాహమైంది. పెళ్లి అయిన నెలకే నవీన్ భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య కేసులో నవీన్ జైలుకు వెళ్లాడు. ఇటీవలే నవీన్ జైలు నుంచి విడుదల అయ్యాడు. విషయం తెలుసుకున్న అత్త అనిత తన ఇంటికి వచ్చి అల్లుడిపై కత్తితో దాడి చేసి చంపింది. నవీన్ మరో అమ్మాయితో వివాహేతర సంబంధం కొనసాగించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుంనే కోపంతోనే అనిత అల్లుడిని చంపేసిందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2020-10-29T17:09:36+05:30 IST