‘హైదరాబాద్లో 28 వేలకుపైగా అక్రమ నిర్మాణాలు.. కూల్చేస్తాం’
ABN, First Publish Date - 2020-11-04T03:24:13+05:30
2016లో కొందరు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవటం వల్ల వెనక్కి తగ్గామన్నారు. మూసీనది ప్రక్షాళన చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని..
హైదరాబాద్: నాలాలపై అక్రమ నిర్మాణాలను కూల్చటంలో రాజీపడమని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. నాలాలపై 28 వేలకుపైగా అక్రమ నిర్మాణాలను గుర్తించామని ఆయన తెలిపారు. 2016లో కొందరు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవటం వల్ల వెనక్కి తగ్గామన్నారు. మూసీనది ప్రక్షాళన చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. మూసీనది పరివాహక ప్రాంత ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని బొంతు రామ్మోహన్ తెలిపారు.
Updated Date - 2020-11-04T03:24:13+05:30 IST