చైతన్య, రాధికా రెడ్డి సహకారంతో మధ్యాహ్న భోజనాలు
ABN, First Publish Date - 2020-04-09T18:43:42+05:30
గరంలోని వలస కూలీలు, నిరుపేదలకు బంజారా మహిళా ఎన్జీవో ఆధ్వర్యంలో చైతన్య, రాధికా రెడ్డి సహకారంతో ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంద్ మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: నగరంలోని వలస కూలీలు, నిరుపేదలకు బంజారా మహిళా ఎన్జీవో ఆధ్వర్యంలో చైతన్య, రాధికా రెడ్డి సహకారంతో ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంద్ మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు. బోరబండ, మోతీ నగర్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అంతేగాక పలు కుటుంబాలకు నిత్యవసరాలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. తాము చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి మద్దతుగా మరింతమంది ముందుకు రావాలని కోరారు. అంతేగాక కరోనా మహమ్మారిని విజయవంతంగా తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2020-04-09T18:43:42+05:30 IST