అన్నను చంపిన వారిని ఎవరినీ వదలను: హేమంత్ తమ్ముడు
ABN, First Publish Date - 2020-09-26T18:19:05+05:30
హేమంత్ హత్యపై తమ్ముడు సుమంత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: హేమంత్ హత్యపై తమ్ముడు సుమంత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయే రెండు రోజుల ముందు అన్నయ్య తనకు ఫోన్ చేశారని..తామిద్దరం బిజినెస్ సంబంధించిన వివరాలు చర్చించుకున్నామని తెలిపారు. వీడియో కాల్ చేసి అన్న మృతదేహాన్ని తనకు చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నను చంపిన వారిని ఎవరినీ వదలనని హెచ్చరించారు. చెప్పులతో కొట్టుకుంటూ మరీ తీసుకెళ్లారని మండిపడ్డారు. వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో తమ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు సుమంత్ తెలిపారు.
Updated Date - 2020-09-26T18:19:05+05:30 IST