మెట్రో రైల్ ఛార్జీలపై హైకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2020-06-03T23:23:36+05:30
మెట్రో రైల్ ఛార్జీలపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలపై హైకోర్టులో విచారణ జరిగింది. మెట్రోరైల్ ఛార్జీలు ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టులో సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హెచ్ఎంఆర్ఎల్, ఎల్ అండ్ టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Updated Date - 2020-06-03T23:23:36+05:30 IST