ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జల్‌పల్లి మునిసిపల్‌ కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం

ABN, First Publish Date - 2020-12-15T07:50:22+05:30

హైదరాబాద్‌ శివారులోని జల్‌పల్లి మునిసిపాలిటీ కమిషనర్‌ జి.ప్రవీణ్‌ కుమార్‌పై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ శివారులోని జల్‌పల్లి మునిసిపాలిటీ కమిషనర్‌ జి.ప్రవీణ్‌ కుమార్‌పై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాలు ఇంకెంతకాలం నీటిలోనే ఉండాలని నిలదీసింది. 2021 వరకూ ఈ ప్రాంతాల్లో నీటిలోనే మునిగి ఉండాలా? అని పురపాలకశాఖ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.


ముంపు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంటూ దాఖలైన రెండు వ్యాజ్యాలు సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఇంకెంతకాలం ఆ ప్రాంతాలు నీటిలో మునిగి ఉండాలని ధర్మానసం ప్రశ్నించింది. ఈ వ్యాజ్యంలో మునిసిపల్‌ కమిషనర్‌ జి.ప్రవీణ్‌ కుమార్‌ దాఖలు చేసిన కౌంటర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మంగళవారం భౌతికంగా కోర్టులో విచారణకు హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. 


Updated Date - 2020-12-15T07:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising