తుపాకీ కలకలం.. ముగ్గురి అరెస్ట్
ABN, First Publish Date - 2020-11-04T02:46:21+05:30
కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో తుపాకీ కలకలం రేగింది. ఇద్దరు యువకులు తుపాకీతో మద్యం షాపు యజమానిని బెదిరించారు. మద్యం షాపు ఫిర్యాదు మేరకు...
మహబూబాబాద్: కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో తుపాకీ కలకలం రేగింది. ఇద్దరు యువకులు తుపాకీతో మద్యం షాపు యజమానిని బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మద్యం షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇద్దరు యువకులతో పాటు మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు తుపాకీ ఎక్కడిదనే కోణంలో విచారిస్తున్నారు.
Updated Date - 2020-11-04T02:46:21+05:30 IST