ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న పాజిటీవ్ కేసులు

ABN, First Publish Date - 2020-06-01T20:08:27+05:30

లాక్ డౌన్ సడలింపులతో ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం జిల్లా: లాక్ డౌన్ సడలింపులతో ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. రోజుకొక ప్రాంతంలో పాజిటీవ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మధిర, నేలకొండపల్లి ప్రాంతాల్లో కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు బయటపడ్డాయి. ప్రారంభంలో మర్కజ్ కాంటాక్ట్ కేసులు 8 పాజిటీవ్ కేసులు రావడంతో వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. జిల్లా యంత్రాంగం ఎక్కడికక్కడ కట్టడి జోన్లను ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంది. కాంటాక్ట్ కేసులు పెరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో చేరిన 8 మంది కోలుకున్నారు. 


అయితే లాక్ డౌన్ నిబంధనల సడలింపులతో ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. మధిరకు చెందిన 65 ఏళ్ల వృద్ధిడికి కరోనా రావడంతో హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ వృద్ధుడి కుమారుడికి పాజిటీవ్ అని తేలడంతో కుటుంబసభ్యులతోపాటు వారికి కాంటాక్ట్‌లో ఉన్న వారందరినీ ఖమ్మం క్వారంటైన్‌కు తరలించారు. నేలకొండపల్లికి చెందిన 8 మందికి కరోనా పాజిటీవ్ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులతోపాటు కాంటాక్ట్‌లో ఉన్న 30 మందిని క్వారంటైన్‌కు పంపారు.

Updated Date - 2020-06-01T20:08:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising