ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగురాలిపై పైశాచికత్వం..

ABN, First Publish Date - 2020-03-07T09:12:47+05:30

వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం కొలన్‌పెల్లి గ్రామంలో ఓ దివ్యాంగురాలిపై ఓ యువకుడు శుక్రవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయపర్తి, మార్చి 6: వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం కొలన్‌పెల్లి గ్రామంలో ఓ దివ్యాంగురాలిపై ఓ యువకుడు శుక్రవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. వర్ధన్నపేట ఏసీపీ రమేష్‌, సీఐ విశ్వేశ్వర్‌ల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొలన్‌పెల్లి గ్రామానికి చెందిన వంగాల ఎల్లయ్య(32) ఇదే మండలంలోని కాట్రపెల్లి గ్రామానికి సొంత పనుల నిమిత్తం వచ్చాడు. గ్రామానికి చెందిన ఓ దివ్యాంగురాలైన యువతికి పోలియో కారణంగా చిన్ననాటి నుంచే కాళ్లు, చేతులు సరిగా పనిచేయడం లేదు. దీంతో ఇంట్లోనే ఉంటోంది. ఈ విషయాన్ని గమనించి, మద్యం మత్తులో ఎవరు లేని సమయంలో ఇంట్లో చొరబడి అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని వెంటనే చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. కాగా, నిందితుడు గతంలో కూడా ఇలాంటి కేసులోనే జైలు శిక్ష అనుభవించినవాడు కావడం గమనార్హం. పాలకుర్తి మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన యువతిని గతంలో అత్యాచారం చేసిన కేసులో 7 సంవత్సరాల పాటు శిక్ష అనుభవించి ఈ మధ్య కాలంలోనే విడుదల అయినట్లుగా తెలుస్తోంది. 


బాలికపై వృద్ధుడి అఘాయిత్యం..

మామునూరు : గ్రేటర్‌ వరంగల్‌ తిమ్మాపూర్‌ సమీపంలోని ఝాన్సీనగర్‌కు చెందిన నాలుగేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఆరవై ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం చేశాడు. గ్రామ సమీపంలోని ఓ మొక్కజొన్న చేనులో ఈ దారుణానికి పాల్పడగా సమాచారం అందుకు న్న మామునూరు సీఐ సార్ల రాజు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. కాగా, వృద్ధుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


కనురెప్పే కాటేసింది.. 

మట్టెవాడ: వరంగల్‌ నగరంలో ఓ బాలికపై కనురెప్పే కాటేసింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై స్వయాన తండ్రి, మేనమామ అత్యాచారానికి ఒడిగట్టారు. కొంత కాలంగా వారు తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగా వేధిస్తున్నారని బాలిక స్కూల్‌ టీచర్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను విచారించి నిందితులను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-07T09:12:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising