ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది: పువ్వాడ
ABN, First Publish Date - 2020-04-04T10:14:37+05:30
ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది: పువ్వాడ
పెనుబల్లి/కల్లూరు, ఏప్రిల్ 3: రబీలో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. దిగుబడికి అనుగుణంగా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి, కల్లూరు మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో హార్వెస్టర్తో వరికోతను అజయ్ ప్రారంభించారు.
Updated Date - 2020-04-04T10:14:37+05:30 IST