125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు జీవో విడుదల
ABN, First Publish Date - 2020-09-17T01:48:08+05:30
125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అంబేద్కర్ విగ్రహ నమూనాను మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి
హైదరాబాద్: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అంబేద్కర్ విగ్రహ నమూనాను మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి రూ.140 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హుస్సేన్సాగర్ సమీపంలో 11 ఎకరాల స్థలంలో అంబేద్కర్ పార్క్, అంబేద్కర్ విగ్రహంతో పాటు మ్యూజియం, లైబ్రరీ ఏర్పాటు చేస్తామని కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు.
Updated Date - 2020-09-17T01:48:08+05:30 IST