ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలలకు ఆటలు, విద్యపై శిక్షణ: వినోద్‌

ABN, First Publish Date - 2020-07-07T07:55:20+05:30

కరోనా నేపథ్యంలో పాఠశాలు నడిచే వాతావరణం లేనందున గ్రామాల్లోని బాలల విద్యా కేంద్రాల్లో పిల్లలకు ఆటలు, పాటలు, చదువులో ప్రత్యేక శిక్షణను ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌కుమార్‌ సూచించారు. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు, యువత ముందుకు వచ్చి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో పాఠశాలు నడిచే వాతావరణం లేనందున గ్రామాల్లోని బాలల విద్యా కేంద్రాల్లో పిల్లలకు ఆటలు, పాటలు, చదువులో ప్రత్యేక శిక్షణను ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌కుమార్‌ సూచించారు. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు, యువత ముందుకు వచ్చి పనిచేయాలన్నారు. బాలల స్థితి, వారి విద్యావకాశాలపై సోమవారం ఎంవీ ఫౌండేషన్‌ నేషనల్‌ కన్వీనర్‌ వెంకట్‌రెడ్డి అధఽ్యక్షతన జరిగిన ఆన్‌లైన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లల కోసం పాఠ్యపుస్తకాలు, కథల పుస్తుకాలు, స్టేషనరీ వంటి వాటిని తాను ప్రధానోపాధ్యాయుతతో మాట్లాడి వాటిని పాఠశాల విద్యా కమిటీలకు అందజేసే చర్యల్ని తీసుకుంటానని ప్రకటించారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ ప్రొఫెసర్‌ శాంతా సిన్హా మాట్లాడుతూ.. బాలలకు ఆటలు, పాటలు, విద్య వంటి అంశాల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్‌ విద్యాధికారి సుకన్య, ఉపేందర్‌రెడ్డి, జగదీశ్వర్‌ రావు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-07T07:55:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising