ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముసురేసింది.. నిండుకుండలుగా మారుతున్న చెరువులు

ABN, First Publish Date - 2020-08-13T16:46:59+05:30

రెండు రోజులుగా కురుస్తున్న ముసురువానలు జలదృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి. జనగామ జిల్లా వ్యాప్తంగా పడుతున్న వర్షాలతో వ్యవసాయబావుల వద్దకు వెళ్లే కాలిబాటలన్నీ బురదమయంగా మారిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ జిల్లా వ్యాప్తంగా ముసురువాన

పత్తి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం


జనగామ (ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా కురుస్తున్న ముసురువానలు జలదృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి. జనగామ జిల్లా వ్యాప్తంగా పడుతున్న వర్షాలతో వ్యవసాయబావుల వద్దకు వెళ్లే కాలిబాటలన్నీ బురదమయంగా మారిపోతున్నాయి. చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరుపోగై నిండుకుండలను తలపిస్తున్నాయి. మెట్టపంటలను సాగు చేసిన రైతులు మాత్రం ముసురు కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా పత్తి, కంది పంటలు నీటమునిగే ప్రమాదంలో ఉన్నాయి.  వరినాట్లు వేసుకునే రైతులకు ఊరటను కల్పిస్తున్నాయి. సాధారణంగా నీటినిచ్చే బోరుబావుల కింద రైతులు ముసురు పుణ్యమాని నాట్లు వేసుకునే పనిలో కర్షకులు నిమగ్నమయ్యారు. గ్రామాల్లో వీధులన్నీ బురదమయంగా మారి చిత్తడిచిత్తడిగా దర్శనమిస్తున్నాయి. వర్షం కారణంగా ఇప్పటికే జిల్లాలోని అనేక చెరువులు మత్తడి పోసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Updated Date - 2020-08-13T16:46:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising