నేడే పంద్రాగస్టు వేడుకలు
ABN, First Publish Date - 2020-08-15T10:38:55+05:30
జిల్లాలో పంద్రాగస్టు వేడుకలు సాదాసీదగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున స్వాతంత్య్ర వేడుకలు
జులైవాడ కలెక్టరేట్లో సాదాసీదగా నిర్వహణ
వరంగల్ అర్బన్ కలెక్టరేట్: జిల్లాలో పంద్రాగస్టు వేడుకలు సాదాసీదగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున స్వాతంత్య్ర వేడుకలు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి వేడుకలు జులైవాడ కలెక్టరేట్లో కొద్దిమంది అధికారుల మధ్య నిర్వహించనున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించనున్నారు. ఉదయం 9:30 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కరోనా వైరస్ ప్రభావంతో తక్కువ మంది అధికారుల మధ్య, భౌతిక దూరం పాటిస్తూ వేడుకలు నిర్వహించనున్నారు. జులైవాడ కలెక్టరేట్లో జెండా ఆవిష్కరించిన అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Updated Date - 2020-08-15T10:38:55+05:30 IST