ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముసలమ్మగుట్ట వద్ద బూటకపు ఎదురుకాల్పులు

ABN, First Publish Date - 2020-10-21T09:27:08+05:30

ములుగు జిల్లా మంగపేట మండలం ముసలమ్మగుట్ట వద్ద ఈ నెల 18న పోలీసులు చేసినవి బూటకపు ఎదురుకాల్పులని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మావోయిస్టు పార్టీ ఆరోపణ


హైదరాబాద్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా మంగపేట మండలం ముసలమ్మగుట్ట వద్ద  ఈ నెల 18న పోలీసులు చేసినవి బూటకపు ఎదురుకాల్పులని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. జయశంకర్‌-భూపాలపల్లి, మహబుబాబాద్‌, వరంగల్‌, పెద్దపల్లి(జేఎండబ్య్లూపీ) డివిజన్‌ కమిటీ కార్యదర్శి వెంకటేశ్‌ పేరుతో మంగళవారం ఒక ప్రకటన బయటకు వచ్చింది.  ఈ ఘటనపై హక్కుల సంఘాలు నిజనిర్ధారణ చేసి, హైకోర్టు ద్వారా న్యాయ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇన్‌ఫార్మర్ల ద్వారా మణుగూర్‌ దళకమాండర్‌ సుధీర్‌, లక్మాలను పోలీ్‌సలు హత్య చేశారని పేర్కొన్నారు. సుధీర్‌ గత పదేళ్లుగా పార్టీలో పనిచేస్తున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పౌరహక్కులను కాలరాస్తూ బూటకపు ఎన్‌కౌంటర్లను కొనసాగిస్తోందని విమర్శించారు. మావోయిస్టు పార్టీ ఎజెండాతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ నిరంకుశపాలనను కొనసాగిస్తోందన్నారు. ముసలమ్మ గుట్ట వద్ద హత్యలకు పాల్పడిన పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-10-21T09:27:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising