గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు
ABN, First Publish Date - 2020-07-11T08:52:49+05:30
తెలంగాణలోని గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం గడువును..
హైదరాబాద్, జూలై 10(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం గడువును ఈనెల 17 వరకు పొడిగించినట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్షలో ఎంపికైన విద్యార్థులు తమ ధ్రువపత్రాలతో సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు తమ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నారు.
Updated Date - 2020-07-11T08:52:49+05:30 IST