నాటిని ప్రతీ మొక్కను సంరక్షించాలి: జేసీ
ABN, First Publish Date - 2020-07-04T11:35:07+05:30
హరితహారంలో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని అదనపు జిల్లా కలెక్టర్ మహేందర్రెడ్డి కోరారు.
వర్ధన్నపేట, జూలై 3 : హరితహారంలో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని అదనపు జిల్లా కలెక్టర్ మహేందర్రెడ్డి కోరారు. శుక్రవారం మునిసిపాలిటీ పరిధిలోని గుబ్బెటితండా ప్రాథమిక పాఠశాల వద్ద చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, కమిషనర్ గొడిశాల రవీందర్గౌడ్, వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్రెడ్డిలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలో తక్కువగా ఉన్న అటవీ విస్తీర్ణాన్ని పెంచి వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు చేస్తున్న భగీరథ ప్రయత్నంలో భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆంగోత్ సునీత, కొండేటి అనిత పాల్గొన్నారు.
రాయపర్తి: హరితహారంలో భాగంగా శుక్రవారం మండలకేంద్రంలో జేసీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2020-07-04T11:35:07+05:30 IST