ప్రతీ రైతు ఇంటికి బీజేపీ కార్యకర్త
ABN, First Publish Date - 2020-10-02T07:59:58+05:30
నూతన వ్యవసాయ చట్టం వల్ల రైతాంగానికి జరిగే మేలుపై అవగాహన కల్పించడానికి ప్రతి రైతు ఇంటికి వెళ్లేందుకు బీజేపీ సన్నద్ధమైంది.
నూతన సాగు చట్టంపై విస్తృత ప్రచారానికి కమలం సన్నద్ధం
హైదరాబాద్, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): నూతన వ్యవసాయ చట్టం వల్ల రైతాంగానికి జరిగే మేలుపై అవగాహన కల్పించడానికి ప్రతి రైతు ఇంటికి వెళ్లేందుకు బీజేపీ సన్నద్ధమైంది. పక్షం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం.. నగరంలో మేధావులు, వివిధ రంగాల నిపుణులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనుంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వంటి ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Updated Date - 2020-10-02T07:59:58+05:30 IST