బ్రేకింగ్: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలూ వాయిదా
ABN, First Publish Date - 2020-06-30T20:34:21+05:30
హైదరాబాద్: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలనూ వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలనూ వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎంట్రెన్స్ టెస్ట్లన్నీ వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ నెల 15 వరకూ కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి షెడ్యూల్ను ఖరారు చేసింది కాగా.. ప్రభుత్వ నిర్ణయంతో పరీక్షలు వాయిదా పడ్డాయి.
కాగా... అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో ఆడుకోవద్దని కోరుతూ పిటిషనర్ కోరారు. దీనిపై నేడు కోర్టులో వాదనలు జరగాల్సి ఉంది. ఎన్ఎస్యూఐ తరపున సీనియర్ న్యాయవాది చల్లా దామోదర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. ఇంతలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Updated Date - 2020-06-30T20:34:21+05:30 IST