మైనర్ బాలికపై అఘాయిత్యం ఘటనపై దర్యాప్తు వేగవంతం
ABN, First Publish Date - 2020-08-13T20:52:27+05:30
హైదరాబాద్: అమీన్పూర్లో మైనర్ బాలికపై అఘాయిత్యం ఘటనకు సంబంధించిన దర్యాప్తు వేగవంతమైంది.
హైదరాబాద్: అమీన్పూర్లో మైనర్ బాలికపై అఘాయిత్యం ఘటనకు సంబంధించిన దర్యాప్తు వేగవంతమైంది. మైనర్ బాలిక మృతిపై మరికాసేపట్లో హైపవర్ కమిటీ సమావేశం కానుంది. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు మహిళ శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హైపవర్ కమిటీలో బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు అపర్ణ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు అన్నపూర్ణ దేవి, ఉమెన్ సేఫ్టీ ఏసీపీ డి.ప్రతాప్, మహిళా కమిషన్ కార్యదర్శి సునంద ఉన్నారు. కాగా కమిటీ సమావేశం తర్వాత బాలిక కుటుంబ సభ్యులు, బంధువులను కలవనుంది. బాలిక బావ అనిల్ సీడబ్ల్యూసీ, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనితో పాటు కుటుంబ సభ్యులను కమిటీ విచారించనుంది.
Updated Date - 2020-08-13T20:52:27+05:30 IST