ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12 నుంచి పీజీ ఈసెట్‌ దరఖాస్తులు

ABN, First Publish Date - 2020-02-20T10:12:39+05:30

ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి పీజీ ఈసెట్‌ ప్రవేశ పరీక్షకు మార్చి 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎలాంటి అపరాధ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మే 28 నుంచి 31 వరకు పరీక్షలు

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి పీజీ ఈసెట్‌ ప్రవేశ పరీక్షకు మార్చి 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్‌ 30వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ మార్చి 4వ తేదీన జారీ చేయనున్నారు. బుధవారం జరిగిన పీజీ ఈసెట్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రూ.500 అపరాధ రుసుముతో మే 6 వరకు, రూ.2వేలతో మే 13 వరకు, రూ.5 వేల రుసుముతో మే 20 వరకు, రూ.10వేల అపరాధ రుసుముతో మే 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు ఫీజు కింద జనరల్‌, బీసీ విద్యార్థులు రూ.వెయ్యి, ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు 500 చెల్లించాల్సి ఉంటుంది. పీజీ ఈసెట్‌ పరీక్షను మే 28 నుంచి 31 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఫలితాలు జూన్‌ 15న విడుదలవుతాయి. 

Updated Date - 2020-02-20T10:12:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising