అప్పనపల్లిలో ఉద్రిక్తత.. వెళ్లిపోయిన హరీశ్రావు
ABN, First Publish Date - 2020-10-28T22:50:14+05:30
అప్పనపల్లిలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన మంత్రి హరీశ్ రావును మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు నిలదీశారు. ప్రాజెక్టు కాలువల కింద భూములు పోయిన రైతులకు ...
సిద్దిపేట: అప్పనపల్లిలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన మంత్రి హరీశ్రావును మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు నిలదీశారు. ప్రాజెక్టు కాలువల కింద భూములు పోయిన రైతులకు ఎకరాకు లక్షా 80 వేలు ఇస్తామనడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. సిద్దిపేట, గజ్వేల్లో ఎకరాకు 15, 13 లక్షల రూపాయలు ఇచ్చినట్లు తమకు ఎందుకు ఇవ్వడంలేదన్నారు. అయితే ఎక్కడా అలా ఇవ్వలేదని మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Updated Date - 2020-10-28T22:50:14+05:30 IST