ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబ్బాక: ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద భారీ భద్రత

ABN, First Publish Date - 2020-11-03T15:21:27+05:30

దుబ్బాకలో ఉపఎన్నిక పోలింగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట జిల్లా: దుబ్బాకలో ఉపఎన్నిక పోలింగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం కొంచెం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ తర్వాత ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు సామాజిక దూరం పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. టెంపరేచర్‌ చెక్‌ చేసిన తరువాత మాత్రమే ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 89 సమస్యత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా 315 ఈవీఎంలు ఉండగా అదనంగా మరో 120 ఈవీఎంలను ఏర్పాటు చేశారు.


దుబ్బాక నియోజక వర్గంలో మొత్తం 1,98,807 మంది ఓటర్లు ఉండగా, వారిలో 97,978 మంది పురుషులు కాగా,  1,00,778 మంది మహిళలు ఉన్నారు. 51 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఉపఎన్నిక సందర్భంగా దుబ్బాకలో 144 సెక్షన్‌ విధించారు.

Updated Date - 2020-11-03T15:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising