వైద్యులపై దాడి అమానుష చర్య: చాడ
ABN, First Publish Date - 2020-04-03T07:46:53+05:30
సికింద్రాబాద్ గాంధీ ఆసత్రిలో వైద్యులపై ముష్కరుల దాడిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. తమ కుంటుంబాలకు...
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : సికింద్రాబాద్ గాంధీ ఆసత్రిలో వైద్యులపై ముష్కరుల దాడిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. తమ కుంటుంబాలకు దూరంగా ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న వారిపై దాడికి దిగడం హేయమైన చర్య అని ఓ ప్రకటనలో ఆయన ధ్వజమెత్తారు. తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా కూడా, ధైర్యంగా వైద్యులు పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. కాగా రాష్ట్రం నుంచి ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారు కరోనా కట్టడికి సహకరించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ను ఆయన కోరారు.
Updated Date - 2020-04-03T07:46:53+05:30 IST