29 నాటికి ఓటరు స్లిప్పులన్నీ పంచండి:ఎస్ఈసీ
ABN, First Publish Date - 2020-11-28T08:42:10+05:30
ఈ నెల 29నాటికి గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లందరికీ ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని ఎస్ఈసీ పార్థసారథి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 29నాటికి గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లందరికీ ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని ఎస్ఈసీ పార్థసారథి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమయ్యారు. పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకున్న వారి పేర్లను నోటీసు బోర్డుపై అతికించాలని సూచించారు.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో నియమావళికి విరుద్ధంగా తరలిస్తున్న రూ.లక్ష నగదుతో పాటు రూ.7,600 విలువైన మద్యాన్ని శుక్రవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ.1.41 కోట్ల నగదు, రూ.11.87 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్నామని అధికారులు తెలిపారు.
Updated Date - 2020-11-28T08:42:10+05:30 IST