మాదిగల విముక్తికి దండోరానే నాంది: మందకృష్ణ
ABN, First Publish Date - 2020-07-07T07:09:41+05:30
మాదిగల విముక్తికి దండోరానే నాంది: మందకృష్ణ
మాదిగల విముక్తికి మాదిగ దండోరా ఉద్యమమే నాంది పలికిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. బానిసత్వపు సంకెళ్లు నుంచి మాదిగ జాతిని విముక్తి చేయడానికి తెలుగు నేల మీద పుట్టిన ఉద్యమమే ఎమ్మార్పీఎస్ అని చెప్పారు. 1994 జూలై 7న ఏపీలోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామం నుంచి ఎమ్మార్పీఎస్ ఉద్యమం మొదలైందని చెప్పారు. మాదిగల కోసమే కాకుండా సమాజంలో వివక్ష, అన్యాయానికి గురైన ప్రతి వర్గం కోసం గొంతెత్తి ఎమ్మార్పీఎస్ పోరాడిందని ఆయన పేర్కొన్నారు. జూలై 7న ఎమ్మార్పీఎస్ 26వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను కొవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
Updated Date - 2020-07-07T07:09:41+05:30 IST